రఘురామపై క్రిమినల్ కేసు పెడతాం: రజత్ భార్గవ్

ABN , First Publish Date - 2022-03-23T00:18:05+05:30 IST

ఏపీ బేవరేజస్ కార్పొరేషన్‌పై దురుద్దేశాలు ఆపాదిస్తూ నివేదిక ఇచ్చిన ఎంపీ రఘురామపై

రఘురామపై క్రిమినల్ కేసు పెడతాం: రజత్ భార్గవ్

అమరావతి: ఏపీ బేవరేజస్ కార్పొరేషన్‌పై దురుద్దేశాలు ఆపాదిస్తూ నివేదిక ఇచ్చిన ఎంపీ రఘురామపై క్రిమినల్ కేసు పెడతామని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ్ తెలిపారు. ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎంపీ రఘురామపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు ఇచ్చిన వివరాల ప్రకారం ఎస్‌జీఎస్ ల్యాబ్స్‌కు బేవరేజస్ కార్పొరేషన్ లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. పరీక్ష చేసిన నమూనాల వివరాలను తెలియజేయాలని కోరామన్నారు. బీఐఎస్ ప్రమాణాల ప్రకారం పరీక్ష చేయాలని కోరలేదని, శాంపిల్స్‌ ఎక్కడివో తెలియదని ఎస్‌జీఎస్ వెల్లడించిందని ఆయన తెలిపారు. అనధికారిక శాంపిల్స్‌కు సంబంధించిన అంశాలను ఎస్‌జీఎస్ పూర్తిగా ధృవీకరణ చేయబోమని పేర్కొందన్నారు. ఇద్దరు వ్యక్తుల మద్యం నమూనాల్లో హానికరమైన పదార్థాలు లేవని ఎస్‌జీఎస్‌ వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-23T00:18:05+05:30 IST