ఏడాదిలోగా పక్కాగృహాల నిర్మాణం పూర్తి

ABN , First Publish Date - 2021-06-17T04:58:54+05:30 IST

జీపాళెం అర్బన్‌ హౌసింగ్‌ లేఅవుట్‌లో ఏడాదిలోపు పక్కాగృహాల నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి అన్నారు.

ఏడాదిలోగా పక్కాగృహాల నిర్మాణం పూర్తి
భూమిపూజలో పాల్గొన్న గురుమూర్తి, భూమన తదితరులు

రేణిగుంట, జూన్‌ 16: అర్బన్‌ హౌసింగ్‌ లేఅవుట్‌లో ఏడాదిలోపు పక్కాగృహాల నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మండలంలోని జీపాళెం వద్ద పేదలకు ప్రభుత్వం ఇంటిస్థలాలు మంజూరు చేసిన విషయం విదితమే. ఈ లేఅవుట్‌లో పక్కాగృహాల నిర్మాణానికి బుధవారం తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీపాళెం లేఅవుట్‌లో 941 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఎంపీ మాట్లాడుతూ జగనన్న కాలనీలో పేదలు ఇబ్బంది పడకుండా నీరు, విద్యుత్తు, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీఇచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌ గిరీష, మేయర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ ముద్రనారాయణ, ఎస్‌ఈ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T04:58:54+05:30 IST