నిరుపేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం

ABN , First Publish Date - 2022-07-01T04:53:34+05:30 IST

నిరుపేద 50 మంది ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు తెలిపారు.

నిరుపేద ఆర్యవైశ్యులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం
ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆర్యవైశ్యసభ సభ్యులు

 ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు 

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 30 : నిరుపేద 50 మంది ఆర్యవైశ్యులకు  ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు తెలిపారు. గురువారం అమ్మవారిశాలలో ఆర్యవైశ్యసభ నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా బుశెట్టి రాంమోహన్‌రావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మురికి సుబ్రహ్మణ్యం, కోశాధికారి మిట్టా శంకర్‌బాబు, 22 మంది కార్యవర్గ సభ్యులు పోలేపల్లి రాజాబాబు, దొంతు ఓబులేసు, రవ్వా సతీష్‌, మేడా వెంకటేశ్వర్లు, వల్లంకొండు రవీంద్ర, మోపూరి సుబ్బారావు, మాలేపాటి సాయికుమార్‌, చీతిరాల బాలరాజు, పొట్టి పిచ్చయ్య, టంగుటూరు మాధవాంజనేయులు, బీకే అరవింద్‌, జూటూరు జగన్‌మోహన్‌, మాలేపాటి రవికుమార్‌, సీవీ సురేష్‌, మేడా వెంకటసత్య ప్రకాశ్‌, దొంతు మురళీకృష్ణ, మేడా మధుసూదన్‌, మురికి శ్రీనివాసులు, పువ్వాడి శివరామకృష్ణ, కొలిశెట్టి ప్రవీణ్‌కుమార్‌, కె.నవీన్‌కుమార్‌, గాజులపల్లె వినయ్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్‌రావు ఆర్యవైశ్య నిరుపేదల సంక్షేమ నిధిని ప్రారంభించారు.

Updated Date - 2022-07-01T04:53:34+05:30 IST