నల్లా కనెక్షన్లు ఇప్పిస్తాం: మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2022-03-22T21:22:35+05:30 IST

పీర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలోని స్పాంజిల్లా కాలనీ వాసుల ఇళ్లకు వ్యక్తిగత

నల్లా కనెక్షన్లు ఇప్పిస్తాం: మంత్రి మల్లారెడ్డి

పీర్జాదీగూడ( హైదరాబాద్): పీర్జాదీగూడ కార్పొరేషన్ పరిధిలోని స్పాంజిల్లా కాలనీ వాసుల ఇళ్లకు వ్యక్తిగత మంచినీటి నల్లా కనెక్షన్లను ఇప్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కాలనీవాసులు, మేయర్ జక్కా వెంకటరెడ్డిల విజ్ఞప్తి మేరకు ఆయన ఈ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం కాలనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూడాలని జలమండలి అధికారులకు ఆయన సూచించారు. కాలనీలో అందరూ కలసికట్టుగా ఉండి ఉల్లాసంగా,  ఉత్సాహంగా అన్ని పండుగలు నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


 మేయర్ జక్కా వెంకటరెడ్డి మాట్లాడుతూ కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్ పరంగా అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. జలమండలి జీఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలనీవాసులకు వ్యక్తిగత మంచినీటి కనెక్షన్లు ఇస్తామన్నారు. కాలనీ ప్రతినిధులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చరణ్, భాస్కరరావు, దేవదానం తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ మహేశ్వరి మహేశ్, వాటర్ బోర్డు స్థానిక అధికారులు హాజరయ్యారు. సొసైటీ ప్రతినిధులు మంత్రి, మేయర్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపి వారిని ఘనంగా సన్మానించారు.

Updated Date - 2022-03-22T21:22:35+05:30 IST