స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-08-14T05:38:04+05:30 IST

స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
కోర్టు ఆవరణలో పారిశుధ్య పనులు చేయిస్తున్న చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌

ఆమనగల్లు, ఆగస్టు 13: మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌ అన్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్‌ రాంపాల్‌ పర్యవేక్షణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. పరిసరాలను శుభ్రం చేశారు. కౌన్సిలర్లు దుడ్డు కృష్ణయాదవ్‌, నాయకులు సుండూరి శేఖర్‌,  గోరటి గిరి, రవిరాథోడ్‌, పాషా, దుడ్డు ఆంజనేయులు, యాదయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-14T05:38:04+05:30 IST