ఆరు నెలల్లో మార్కెట్ను అందుబాటులోకి తెస్తాం
ABN , First Publish Date - 2022-06-27T06:38:26+05:30 IST
ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వె జ్, నానవెజ్ మార్కెట్ను ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు.
నకిరేకల్, జూన 26: ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా వె జ్, నానవెజ్ మార్కెట్ను ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. పట్టణంలోని మూసీ రోడ్డులో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వెజ్, నానవెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రధానంగా మహిళలకు ఇబ్బందులు కలుగకుం డా ఈ ఏర్పాటు చేశామన్నారు. కూరగాయలు, మాంసం పరిశుభ్రం గా ఉండే విధంగా ఒకే వేదికపై ఈ మార్కెట్ను నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన రాచకొండ శ్రీనువా్సగౌడ్, మార్కెట్ చైర్మన కొప్పుల ప్రదీ్పరెడ్డి, జడ్పీటీసీ మాద ఽధనలక్ష్మి, మండల, పట్టణ అధ్యక్షుడు నవీనరావు, సైదిరెడ్డి, నాయకులు సోమ యాదగిరి, మురారిశెట్టి కృష్ణమూర్తి, పెండెం సదానందం, కొండ జానయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.