రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరిస్తాం
ABN , First Publish Date - 2020-11-27T05:18:50+05:30 IST
రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరిస్తామని పోలీసులు ప్రతిజ్ఞ చేశారు.
శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తూ.. రాజ్యాంగ స్ఫూర్తిని ఆచరిస్తామని పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా పోలీసుల కార్యాలయంలో ఎస్పీ అమిత్ బర్దర్ పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ శేఖర్, సీఐలు, ఆర్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.