గొల్లబాయి చెరువుకు మరమ్మతులు చేయిస్తాం
ABN , First Publish Date - 2022-06-30T03:40:09+05:30 IST
గొల్లబాయి చెరువు మరమ్మతు పనులను త్వరలో పూర్తి చేయి స్తామని జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణా రావు అన్నారు. ఈనెల 20న ‘ఆంధ్రజ్యోతి’లో ‘గొల్లబాయి చెరువు గోడు పట్టేదెవరి’కి పేరున కథనం ప్రచురి తమైంది.దీంతో ఆయన బుధవారం గొల్లబాయిచెరువును పరిశీలించారు.
- జడ్పీ వైస్చైర్మన్ కోనేరు కృష్ణారావు
- ఆంధ్రజ్యోతికి స్పందన
బెజ్జూరు, జూన్ 29: గొల్లబాయి చెరువు మరమ్మతు పనులను త్వరలో పూర్తి చేయి స్తామని జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణా రావు అన్నారు. ఈనెల 20న ‘ఆంధ్రజ్యోతి’లో ‘గొల్లబాయి చెరువు గోడు పట్టేదెవరి’కి పేరున కథనం ప్రచురి తమైంది.దీంతో ఆయన బుధవారం గొల్లబాయిచెరువును పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లోగా అధికారులతో అంచనాలు పూర్తిచేసి మరమ్మతు పనులు చేపడుతామన్నారు. ఆయకట్టు రైతులకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి సాగునీరు అందించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.