పొగాకు రైతులకు అండగా ఉంటాం : చైర్మన్
ABN , First Publish Date - 2020-07-05T11:30:49+05:30 IST
పొ గాకు రైతులకు అన్ని విధాలుగా అండ గా ఉంటామని పొగాకు బోర్డు చైర్మన్ వై.రఘునాథబాబు పేర్కొన్నారు. శనివా రం
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 4 : పొ గాకు రైతులకు అన్ని విధాలుగా అండ గా ఉంటామని పొగాకు బోర్డు చైర్మన్ వై.రఘునాథబాబు పేర్కొన్నారు. శనివా రం టంగుటూరు మండలం మర్లపా డులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని ర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పా ల్గొన్నారు. అనంతరం రైతులతో చైర్మన్ మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు సీఎం జగ న్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ను రంగంలోకి దించడం అభినందనీయమన్నారు. ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ రైతుల సం క్షేమం కోసం ప్రత్యేక పథకాలను అమ లు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమం లో బీజేపీ నాయకులు డాక్టర్ కె.నరసిం గరావు, బొల్లినేని వెంకటేశ్వర్లు, నాగేంద్ర యాదవ్, కొమ్ము శ్రీనివాసరావు, జయవ రపు సుబ్బారావు పాల్గొన్నారు.
టంగుటూరు: మార్క్ఫెడ్ రాకతో పొ గాకు వేలంలో పోటీ ఏర్పడుతుందని, త ద్వారా రైతులకు మంచి ధరలు లభిస్తాయని పొగాకు బోర్డు చైర్మన్ య డ్లపాటి రఘునాథబాబు అన్నారు. టం గుటూరులోని రెండు పొగాకు వేలం కేం ద్రాలను శనివారం ఆయన సందర్శించా రు. పొగాకు కొనుగోళ్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మద్య విమో చన ప్రచార కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వెం కయ్య, సొసైటీ అధ్యక్షుడు రావూరి అ య్యవారయ్య, వైసీపీ మండల అధ్యక్షు డు హరిబాబు పాల్గొన్నారు.