2024 ఎన్నికల కోసం పనిచేస్తాం: పిన్నెల్లి

ABN , First Publish Date - 2022-04-12T21:55:32+05:30 IST

2024 ఎన్నికల కోసం పనిచేస్తాం: పిన్నెల్లి

2024 ఎన్నికల కోసం పనిచేస్తాం: పిన్నెల్లి

అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ అంటే నేను, నేను అంటే నా పార్టీ అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 2009లో రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బి ఫామ్ తీసుకున్నామని, తర్వాత 3 సార్లు జగన్ చేతులు మీదుగా తీసుకున్నానని ఆయన అన్నారు. నిన్నటి నుంచి అసంతృప్తి అని వస్తున్న వార్తలు నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఛాంబర్ లో కి వెళ్తున్నారని తెలిసి వచ్చానని ఆయన అన్నారు. అనుచరులు రాజీనామా చేశారు అనేది అనుకోకుండా ఆవేశంలో జరిగిందని, కార్యకర్తలకు ఆశ ఉంటుందని, వెంటనే వారికి విషయం వివరించానని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తమ లక్ష్యం 2024 ఎన్నికలు.. దానికోసం పనిచేస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-12T21:55:32+05:30 IST