ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారానికి కృషి చేస్తాం

ABN , First Publish Date - 2021-12-07T05:01:30+05:30 IST

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో భూము లు కోల్పోయిన రైతులకు భూములు, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సురేందర్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారానికి కృషి చేస్తాం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే సురేందర్‌

కామారెడ్డి, డిసెంబరు 6: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌లో భూము లు కోల్పోయిన రైతులకు భూములు, పరిహారం ఇప్పించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సురేందర్‌, కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం భూము లు కోల్పోతున్న రైతులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, కలెక్టర్‌ జితే ష్‌ వి.పాటిల్‌ సమావేశం నిర్వహించారు. రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. అసైన్‌మెంట్‌ భూములు కోల్పోయిన రైతులందరికీ న్యా యం చేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో లింగంపల్లి, జన గాం, కరడ్‌పల్లి గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


హరితహారం లక్ష్యాన్ని అధికారులు పూర్తి చేయాలి

హరితహారం లక్ష్యాలను అన్ని శాఖల అఽధికారులు పూర్తి చేయాల ని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో 2022లో శాఖల వారిగా నాటే మొక్కల లక్ష్యాలను నిర్ణయించారు. ఉపాధిహామీ అధికారులు 25లక్షల మొక్కలు నాటాలని సూచి ంచారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, పాఠశాలల వద్ద గల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలన్నారు. కామారెడ్డి, ఎల్లారెడి, బా న్సువాడలోని మున్సిపల్‌ స్థలాల్లో మొక్కలు నాటే విధంగా చూడాల న్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ధోత్రే, డీఎఫ్‌వో నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:01:30+05:30 IST