బలహీన వర్గాలను నిర్వీర్యం చేస్తున్నారు

ABN , First Publish Date - 2021-08-23T23:55:34+05:30 IST

రాష్ట్రంలోని బలహీన వర్గాలను సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ

బలహీన వర్గాలను నిర్వీర్యం చేస్తున్నారు

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలోని బలహీన వర్గాలను సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర విమర్శించారు. ఏలూరు బీసీ గర్జన సభలో బలహీన వర్గాలకు న్యాయం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం బీసీలకు 15 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తానన్నాడన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా, బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చిన పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వంలో 2,653 వేల కోట్ల రూపాయలను బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చామని రవీంద్ర తెలిపారు. 

Updated Date - 2021-08-23T23:55:34+05:30 IST