చెత్త నుంచి సంపద కేంద్రాలను వాడుకలోకి తీసుకురావాలి
ABN , First Publish Date - 2022-01-23T04:43:04+05:30 IST
మండలంలో నిరుపయోగంగా ఉన్న చెత్తసంపద కేంద్రాలకు మరమ్మతులు చేయించి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని డీపీవో జీవీ నారాయణరెడ్డి పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని సింగరాయకొండ, పాతసింగరాయకొండలోని చెత్త నుంచి సంపద కేంద్రాలను డీపీవో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.
సింగరాయకొండ, జనవరి 22 : మండలంలో నిరుపయోగంగా ఉన్న చెత్తసంపద కేంద్రాలకు మరమ్మతులు చేయించి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని డీపీవో జీవీ నారాయణరెడ్డి పంచాయితీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండలంలోని సింగరాయకొండ, పాతసింగరాయకొండలోని చెత్త నుంచి సంపద కేంద్రాలను డీపీవో ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో చెత్తసేకరించే రిక్షాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వి. రామ్మోహన్రావు, ఎస్. మారుతిబాబు పాల్గొన్నారు.