మీకు దండం పెడతా..మాస్కు ధరించండి
ABN , First Publish Date - 2021-04-16T04:47:35+05:30 IST
‘మీకు దండం పెడతా మాస్క్ పెట్టుకోండి. కరోనా విజృంభిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు. దయచేసి నిబంధనలు పాటించండి’..అంటూ సాలూరు ఎస్ఐ ఫకృద్దీన్ ఓ వాహన చోదకుడికి విజ్ఞప్తి చేశారు.
సాలూరు: ‘మీకు దండం పెడతా మాస్క్ పెట్టుకోండి. కరోనా విజృంభిస్తోంది. నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు. దయచేసి నిబంధనలు పాటించండి’..అంటూ సాలూరు ఎస్ఐ ఫకృద్దీన్ ఓ వాహన చోదకుడికి విజ్ఞప్తి చేశారు. గురువారం కరోనా నిబంధనలు పాటించాలంటూ సాలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు వాహన చోదకులు మాస్కులు లేకుండా రావడాన్ని గుర్తించారు. వారి వాహనాలను నిలిపి చేతులు జోడించి అభ్యర్థించారు.