నైరుతి నిష్క్రమణ ప్రారంభం.. భారీ వర్షాలకు అవకాశం..

ABN , First Publish Date - 2020-09-29T12:13:05+05:30 IST

దేశంలో వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ సోమవారం ప్రారంభమైందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే

నైరుతి నిష్క్రమణ ప్రారంభం.. భారీ వర్షాలకు అవకాశం..

అమరావతి/విశాఖ: దేశంలో వాయువ్య భారతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ సోమవారం ప్రారంభమైందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌, బికనీర్‌ల నుంచి ఈనెల 17నే ఉపసంహరణ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 11 రోజులు ఆలస్యమైంది. ఏపీ నుంచి అక్టోబరు 15న రుతుపవనాలు నిష్క్రమిస్తాయని అంచనా. కాగా, దక్షిణ ఏపీలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.  29న రాయలసీమలో, 30న రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2020-09-29T12:13:05+05:30 IST