'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ABN , First Publish Date - 2021-10-05T17:34:49+05:30 IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న బాలికలకు శానిటరీ నాప్కిన్స్ను ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందన్నారు. బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ అందించడమే 'స్వేచ్ఛ' ఉద్దేశ్యమన్నారు. 7వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థినులకు ఈ కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో 'స్వేచ్ఛ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.