ఇద్దరి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-03-01T05:16:26+05:30 IST

వివాహేతర సంబంధం ఇద్దరి అనుమానాస్పద మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళితే ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన కుసుమ నాగసాయి (30)కి 2014లో నిడదవోలు మండలం తాళ్ళ పాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది.

ఇద్దరి అనుమానాస్పద మృతి
మృతదేహాలు పరిశీలిస్తున్న సీఐ స్వామి

వివాహేతర సంబంధమే కారణమా..?

నిడదవోలు, ఫిబ్రవరి 28: వివాహేతర సంబంధం ఇద్దరి అనుమానాస్పద మృతికి కారణమైంది. వివరాల్లోకి వెళితే  ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన కుసుమ నాగసాయి (30)కి 2014లో నిడదవోలు మండలం తాళ్ళ పాలెం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం అయ్యింది.వీరికి 6 సంవత్సరాల బాబు, 4 సంవత్సరాల పాప ఉన్నారు. మృతురాలికి ఏలూరు గన్‌బాజార్‌ సెంటరుకు చెందిన షేక్‌ నాగూర్‌ (28)తో వివాహేతర బంధం ఏర్ప డడంతో అతను తరచుగా తాళ్ళపాలెం వచ్చి వెళుతుండే వాడని ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఏలూరు నుంచి షేక్‌ నాగూర్‌ తాళ్ళపాలెం రాగా మృతురాలి దగ్గర బంధువు మరో మహిళ వీరిద్దరు ఉండేందుకు ఒక గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.ఈలోగా మృతురాలి భర్త మరో నలు గురితో అక్కడకి వచ్చి గదిలో ఉన్న నాగసాయి, షేక్‌ నాగూ ర్‌లను పట్టుకుని శెట్టిపేటలోని మరో దగ్గర బంధు వుకు చెందిన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటరులో బంధించి ఉంచి నట్లు సమా చారం. ఈ నేపథ్యంలో నాగ సాయి, నాగూర్‌లు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటరులో ఉన్న ఎలుకల మందు తిని ఆత్మ హత్యకు పాల్ప డగా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు మండలం తంగెళ్లమూడికి చెందిన మృతురాలి తల్లి రేణుకేశ్వరి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోద చేసినట్టు పోలీసులు తెలిపారు.సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేఏ స్వామి కేసు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-03-01T05:16:26+05:30 IST