పుట్టాకు ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-07-01T04:55:02+05:30 IST
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మైదుకూరు టికెట్ పుట్టా సుధాకర్యాదవ్కు ఖాయమని తెలుసుకున్న అభిమానులు మైదుకూరుకు వస్తున్న ఆయనకు విమానాశ్రయం వద్ద గురువారం పార్టీ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీ
మైదుకూరు, జూన్ 30 : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మైదుకూరు టికెట్ పుట్టా సుధాకర్యాదవ్కు ఖాయమని తెలుసుకున్న అభిమానులు మైదుకూరుకు వస్తున్న ఆయనకు విమానాశ్రయం వద్ద గురువారం పార్టీ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని మైదుకూరు, ఖాజీపేట, బి మఠం, చాపాడు, దువ్వూరు మండలాలకు చెందిన వేలాది మంది కడప విమానాశ్రయం చేరుకుని అక్కడ కేక్ కట్ చేసి స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.