కల్యాణం.. కమనీయం

ABN , First Publish Date - 2021-03-01T05:57:49+05:30 IST

కనగల్‌ మండంలోని పగిడిమర్రి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిదాంబల కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కల్యాణం.. కమనీయం
కనగల్‌ : వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు

 పగిడిమర్రిలో ఘనంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం
 గోపలాయపల్లిలో గరుడవాహన సేవ

కనగల్‌, ఫిబ్రవరి 28 :
కనగల్‌ మండంలోని పగిడిమర్రి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిదాంబల కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దామోదరశర్మ, మహే్‌షశర్మ కల్యాణతంతు నిర్వహించారు. కల్యాణ తలంబ్రాలు, పట్టువస్త్రాలను సర్పంచ్‌ గోలి నర్సిరెడ్డిభాగ్యమ్మ దంపతులు అందించారు. కల్యా ణం అనంతరం సుంకిరెడ్డి రవీందర్‌రెడ్డి, శోభ దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. సోమవారం నిర్వహించే అగ్ని గుండాలతో జాతర ముగుస్తుందని నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌ నర్సిరెడ్డి, ఎంపీటీసీ ఎర్రమాద యశోద, ఎర్రమాద వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు జగాల్‌రెడ్డి, కృష్ణవేణి, రవీందర్‌ పాల్గొన్నారు.
గరుడ వాహనంపై ఊరేగిన వేణుగోపాలుడు
నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గరుడ సేవను నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనంపై రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తులను ఆశీనులను గావించి భక్తుల గోవింద నామస్మరణలు, మ ంగళవాయిద్యాల మధ్య ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. వేడుకలో దేవస్థాన అనువంశిక ధర్మకర్త  మోహన్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
మారేపల్లిలో వైభవంగా కల్యాణం
 అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీస్వయం భు వేంకటేశ్వర స్వామి కల్యాణం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి హాజరైన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి పాలక మండలి సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు నోముల భగత్‌, సీఎల్పీ మాజీ నేత జానా తనయుడు  జయ్‌వీర్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, కూరాకుల వెంకటేశ్వర్లు, జగన్మోహన్‌రావు, నీలమ్మ, హాలియా మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఘనంగా దుర్గామాత ఆలయ వార్షికోత్సవం
గుర్రంపోడు మండలంలోని జూనూతుల గ్రామంలో దుర్గామాత ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డి హాజరై హోమ పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కంచర్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌కంచర్ల జగదీశ్వర్‌రెడ్డి, జాల చినసత్తయ్యయాదవ్‌, సూదిని జగదీశ్వర్‌రెడ్డి, నిర్వహాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం
నాంపల్లి  మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఏలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్‌ ఏంపీపీ పానగంటి రజనివెంకన్నగౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్‌, కుంభం కృష్ణారెడ్డి, పానగంటి వెంకన్నగౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పూల వెంకటయ్య వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:57:49+05:30 IST