పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాలి

ABN , First Publish Date - 2021-03-02T06:09:36+05:30 IST

పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో గెలుపొందిన నూతన సర్పంచులు గ్రామాభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలు అందించాలని ఎమ్మెల్యే బుర్రా మఽధుసూదన్‌ యాదవ్‌ అన్నారు.

పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాలి
ఎమ్మెల్యేను సన్మానిస్తన్న సర్పంచులు

బుర్రా మదుసూదన్‌ యాదవ్‌

పామూరు, మార్చి 1: పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో గెలుపొందిన నూతన సర్పంచులు గ్రామాభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలు అందించాలని ఎమ్మెల్యే బుర్రా మఽధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. స్థానిక సత్యదేవుని కల్యాణ మండపంలో సోమవారం మండలంలో వైసీపీ మద్దతులో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులకు సన్మాన, అభినందన సభ నిర్వహించారు. ముందుగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విజయోత్సవ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లడుతూ దేశాభివృద్ధికి గ్రామాలు పట్టుకొమ్మలని, గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గానికి చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమాల్లో గంగసాని హుస్సేన్‌రెడ్డి, గంగసాని లక్ష్మి, సీహెచ్‌ సుబ్బయ్య, పువ్వాడి రాంబాబు, కె.రామిరెడ్డి, చల్లా సుబ్బారావు, డాక్టర్‌ కోటపాటి శ్రీనివాసులు, చాంద్‌బాషా, యాదాల సాయి కిరణ్‌, శ్రీనివాసులు, చల్లా శివయ్య, ఎం.గురవయ్య, కందుల శ్రీనివాసులరెడ్డి, గట్లా విజయభాస్కర్‌రెడ్డితో పాటు పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:09:36+05:30 IST