పథకాల ఫలాలు యానాదులకు అందేలా చూడాలి

ABN , First Publish Date - 2021-07-28T06:12:41+05:30 IST

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలు యానాదుల ముంగిటకు చేరేలా అధికారులు చొరవ చూపించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కోరారు.

పథకాల ఫలాలు యానాదులకు అందేలా చూడాలి
సమావేశం అనంతరం అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

కందుకూరు, జూలై 27: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ కార్యక్రమాలు యానాదుల ముంగిటకు చేరేలా అధికారులు చొరవ చూపించాలని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కోరారు. యానాదుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో నెల్లూరులో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యానాదుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం అమ లు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో సరైన అవగాహన లేకపోవడం తో లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. వాటిపై అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో యానాదుల సమస్యలపై ఆయన అసెంబ్లీలోనూ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. యానాదుల అభివృద్ధికోసం నిర్వహించిన సమావేశానికి ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరు వెళ్లి హాజరై తమ సమస్యలను ప్రస్తావించటం పట్ల యానాదుల సంఘం ప్రతినిధి చేవూరి దుర్గాప్రసాద్‌ కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2021-07-28T06:12:41+05:30 IST