అర్హులందరికి సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-06-28T05:03:35+05:30 IST

అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించటమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

అర్హులందరికి సంక్షేమ పథకాలు
20వ వార్డులో ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య 

అద్దంకి, జూన్‌ 27: అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించటమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో బాగంగా సోమవారం పట్టణంలోని 20వ వార్డులో ఇంటింటికి తిరిగి ఆయా కుటుంబాలకు  ప్రభుత్వం  నుంచి అందుతు న్న లబ్ధిని వివరించారు. ఈ సందర్బంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు కూడా మంజూ రు చేయిస్తామన్నారు. అద్దంకి పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్టు చెప్పారు. 

సచివాలయ ఉద్యోగుల ప్రొహిబిషన్‌ జీవో విడుదల చేసిన  సంద ర్భంగా  10వ సచివాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు సీఎం చిత్రప టానికి పాలాభిషేకం నిర్వహించారు. కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భం గా కృష్ణచైతన్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా యు వతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కు తుందన్నారు. కార్యక్రమాలలో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌చైర్మన్‌లు దేసు పదే ్మష్‌, అనంతలక్ష్మి, కౌన్సిలర్‌ గుంజి  కోటేశ్వరరా వు, వైసీపీ  పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమే ష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:03:35+05:30 IST