అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-08-10T04:03:18+05:30 IST

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ధ్యేయమ ని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అద్దంకి, ఆగస్టు 9 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ధ్యేయమ ని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని నాగులపాడులో మంగళవారం గ డప గడపకు మన ప్రభుత ్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మా ట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంద న్నారు. ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు, సంక్షేమ  పథకాలు లబ్ధి దారులకు వేగవంతంగా అందించేందుకు సచివాలయ వ్యవస్థ, వలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు చేసిందన్నారు. ఇంటింటికి తిరిగి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాలు  పంపిణీ చేశారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ జ్యోతి వెంకటరత్నమ్మ, సర్పంచ్‌ మంగమూరి రాజేశ్వరి, ఎంపీడీవో రాజేందర్‌, తహసీల్దార్‌ వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ జ్యోతి హనుమంతరావు,  అవిశన ప్రభాకరరెడ్డి,  జాలాది కామేశ్వరరావు, కాకాని రాధాకృష్ణమూర్తి, సంది రెడ్డి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:03:18+05:30 IST