ప్రముఖ ప్రవాస ఫొటోగ్రాఫర్ కన్నుమూత
ABN , First Publish Date - 2022-07-03T18:30:19+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్లో పని చేస్తున్న ప్రముఖ ప్రవాస ఫొటోగ్రాఫర్ గఫూర్ మూడాడి కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ దేశం కువైత్లో పని చేస్తున్న ప్రముఖ ప్రవాస ఫొటోగ్రాఫర్ గఫూర్ మూడాడి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన కువైత్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ (KISR)తో కలిసి ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన గఫూర్ గత కొన్నేళ్లుగా కువైత్లోనే ఉంటున్నారు. ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లు స్వదేశంలో ఉంటారు. ఈ నెల 19న పెద్ద కూతురి పెళ్లి ఉంది. కుమార్తె వివాహం కోసం జూన్ 22న ఇండియాకు వచ్చారు. స్వదేశానికి వచ్చిన తర్వాత గఫూర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబ ఆయనను కోజికోడ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. గఫూర్కు భార్య ఫౌజియా, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇక కువైత్లోని భారతీయ కమ్యూనిటీలో గఫూర్కు మంచి పేరు ఉంది. అక్కడ ప్రవాసులకు ఏదైనా అవసరమైతే సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే వారట. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రవాసులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.