తల్లిదండ్రుల కళ్లెదుటే బిడ్డ మృతి...

ABN , First Publish Date - 2021-03-07T04:29:29+05:30 IST

తల్లిదండ్రుల కళ్లెదుటే బిడ్డ మృతిచెందిన విషాదఘటన ఇది..

తల్లిదండ్రుల కళ్లెదుటే బిడ్డ మృతి...
బాలుడిని పట్టుకుని రోదిస్తున్న తండ్రి, పక్కనే సొమ్మసిల్లి పడిపోయిన తల్లి

స్కూల్‌ బస్‌ ఢీకొని రోడ్డుపై పడి మృతిచెందిన బాలుడు

భీమడోలు/ ఏలూరుక్రైం, మార్చి 6  : తల్లిదండ్రుల కళ్లెదుటే బిడ్డ మృతిచెందిన విషాదఘటన ఇది.. అప్పటి వరకూ తమతో ఉన్న బాలుడు ఇక లేడని తెలిసి తల్లి దండ్రులు బోరున విలపించారు. దెందులూరు మం డలం దోసపాడు గ్రామానికి చెందిన చలమలపూడి అశోక్‌, ప్రశాంతి దంపతులు కుమారుడు స్టీఫెన్‌పాల్‌ (రెండున్నరేళ్లు) బాబును తీసుకుని మోటార్‌ సైకి ల్‌పై శనివారం భీమడో లులో ఓ ప్రైవేటు ఆసు పత్రికి బయలుదేరారు. సూరప్పగూడెం చేరుకునే సరికి జాతీయ రహ దారిపై వస్తున్న ఏలూ రుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ స్కూలు బస్సు మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బాలుడు స్టీఫెన్‌పాల్‌ నేలపై పడ డంతో తీవ్ర గాయాలై అక్కడి కక్కడే మృతిచెం దాడు.తల్లి ప్రశాంతి గాయాలపాలవ్వడంతో ఏలూరు ప్రభు త్వాసు పత్రికి తరలించారు. కేసును భీమడోలు పోలీ సులు దర్యాప్తు చేస్తు న్నారు. బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఎన్‌ఆర్‌ఐ కాలేజీ ముందు ధర్నా చేశారు. ఈ సమా చారం అందుకున్న త్రీ టౌన్‌ పోలీసులు అక్కడకు చేరు కుని బాధితులకు నచ్చ జెప్పి పరిస్థితిని అదుపు చేశారు. 

Updated Date - 2021-03-07T04:29:29+05:30 IST