కారు గెలుచుకున్నారంటూ ఫోన్... రూ.90వేలు స్వాహా

ABN , First Publish Date - 2022-06-18T14:52:47+05:30 IST

కారు గెలుచుకున్నారంటూ ఫోన్ చేసి రూ.90వేలు స్వాహా చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

కారు గెలుచుకున్నారంటూ ఫోన్... రూ.90వేలు స్వాహా

పశ్చిమగోదావరి: కారు గెలుచుకున్నారంటూ ఫోన్ చేసి రూ.90 వేలు స్వాహా చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి చెందిన రాజబాబు అనే వ్యక్తికి మీ ఫోన్ నెంబరుకు నాస్టాల్ కంపెనీ నుంచి కారు గెలుచుకున్నారంటూ ఫోన్ వచ్చింది. ఈ క్రమంలో నగదు జమ చేయాలంటూ సదరు వ్యక్తులు రాజబాబుకు తెలిపారు. కారు గెలుచుకున్నానన్న ఆనందంలో ఉన్న రాజబాబు... కంపెనీ పేరిట చెప్పిన ఫోన్ నెంబరుకు ఫోన్ పే ద్వారా రూ.90 వేల నగదు వేశాడు. అయితే ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ నెంబర్ పని చేయకపోవడంతో మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. ఈ విషయంపై బాధితుడు రాజాబాబు భీమవరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-18T14:52:47+05:30 IST