Eluru: వృద్ధురాలి హత్య కేసును చేధించిన పోలీసులు
ABN , First Publish Date - 2021-12-16T18:12:24+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలనులో ఈ నెల 3న జరిగిన నాగమణి వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలనులో ఈ నెల 3న జరిగిన నాగమణి వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు గతంలో మరో మూడు హత్యలు చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 34 గ్రాముల బంగారం, 60 గ్రాముల వెండి , రూ.4000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళా వృద్ధులనే టార్గెట్ చేసి చంపారు. గతంలో చేసిన 3 హత్యలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.