తణుకులో ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-03-10T15:23:37+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి స్కూల్ ఉపాధ్యాయుడు కేఎస్ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు.

తణుకులో ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మాంటిస్సోరి స్కూల్ ఉపాధ్యాయుడు కేఎస్ శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ భవనంలో ఉరి వేసుకుని ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివప్రసాద్ స్వస్థలం కేరళ రాష్ట్రం. గత మూడేళ్లుగా స్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-03-10T15:23:37+05:30 IST