AP: నిద్రిస్తున్న భార్యను హత్య చేసిన భర్త
ABN , First Publish Date - 2022-03-10T16:46:48+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మర్రిపాలెంలో దారుణం జరిగింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మర్రిపాలెంలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న భార్యను భర్త సుందరరావు దారుణంగా హత్య చేశారు. నిందితుడు గతంలో ఒక కేసులో పదేళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.