Eluru: అన్నదమ్ముల మధ్య సరిహద్దు వివాదం
ABN , First Publish Date - 2022-03-11T16:06:36+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరంలో అన్నదమ్ముల మధ్య స్థలం సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరంలో అన్నదమ్ముల మధ్య స్థలం సరిహద్దు వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. అన్నదమ్ముల వివాదం వర్గపోరుగా మారింది. ఒక వర్గంపై మరో వర్గం కత్తులతో దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అన్నదమ్ముల వర్గపోరుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.