డ్రింక్తో తలపై కొట్టి.. గొలుసు లాక్కుపోయాడు
ABN , First Publish Date - 2021-03-01T05:13:19+05:30 IST
కూల్డ్రింక్తో తలపై కొట్టి కిరాణా కొట్టు యజమాని నానుతాడు లాక్కుపోయాడు.
కాల్దరిలో కిరాణా కొట్టు యజమానిపై అపరిచిత వ్యక్తి దాడి
ఉండ్రాజవరం, ఫిబ్రవరి 28 : కూల్డ్రింక్తో తలపై కొట్టి కిరాణా కొట్టు యజమాని నానుతాడు లాక్కుపోయాడు. కాల్దరి గ్రామంలో కిరాణా కొట్టు వద్దకు ఒక అపరిచిత వ్యక్తి వచ్చి కూల్డ్రింక్ కొనుగోలు చేసి డీఫ్రిజ్లో పెట్టమని చెప్పి వెళ్లిపోయాడు.కొద్ది సేపటికి తిరిగి వచ్చి తాను కొనుగోలు చేసిన డ్రింక్ ఇమ్మని అడిగాడు. కిరాణా కొట్టు యజమాని ఫ్రిజ్లోనుంచి డ్రింక్ తీసి ఇవ్వగా అదే డ్రింక్తో తలపై కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుపోయాడు.ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఉండ్రాజవరం ఎస్ఐ అవినాష్ కేసు నమోదు చేశారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానం వస్తే సమాచారం అందించాలన్నారు.