పశ్చిమ గోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2021-05-09T14:57:05+05:30 IST

టీ.నర్సాపురం మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అల్లంచర్ల గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజుల

పశ్చిమ గోదావరి జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

పశ్చిమ గోదావరి: టీ.నర్సాపురం మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. అల్లంచర్ల గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారం రోజుల క్రితం ఓ ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించండంతో కరోనా పాజిటివ్ కేసులు  వచ్చినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. కార్యక్రమం జరిగిన ఇంట్లో ఒకరికి పాజిటివ్ రావడంతో కార్యక్రమంలో పాల్గొన్న మిగతా 60 మంది గ్రామస్థులు టెస్టులు చేయించుకున్నారు. అయితే వారి రిపోర్టులు ఇంకా రావాల్సివుందని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-05-09T14:57:05+05:30 IST