ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు ప్రశాంతం

ABN , First Publish Date - 2021-03-01T05:08:40+05:30 IST

ఎన్‌టీఎస్‌ఈ లెవెల్‌–1 పరీక్ష, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించారు.

ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు ప్రశాంతం

ఏలూరుఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 28 : ఎన్‌టీఎస్‌ఈ లెవెల్‌–1 పరీక్ష, ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించారు. ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు 2811 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2665 మంది హాజరయ్యారు. ఎన్‌టీఎస్‌ఈ పరీక్షకు 1590 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం జరిగిన పేపర్‌–1 పరీక్షకు 1218 మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్‌–2 పరీక్షకు 1311 మంది   హాజరయ్యారు.డీఈవో సి.వి.రేణుక, ఏలూరు డీవైఇవో డి.ఉదయకుమార్‌, స్క్వాడ్‌ బృందాలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేశాయి.ఏలూరులోని ఎన్‌టీఎస్‌ఈ పరీక్షల  కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసి డీవైఈవో ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు షోకాజు నోటీసు జారీ చేశారు. కేపీడీటీ హైస్కూల్‌ ప్రధానో పాధ్యాయుడు వి.ఎస్‌.ప్రేమ్‌చంద్‌, రావికంపాడు జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం ఎం.ఎ.సత్యనారాయణలకు షోకాజు నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2021-03-01T05:08:40+05:30 IST