ఏలూరులో ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-12-09T16:54:04+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరులో ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠా అరెస్టు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం వేమనీడు త్రినాధబాబు అనే వ్యక్తిని ముఠా కిడ్నాప్ చేసింది. త్రినాధ్ బాబు తండ్రికి ఫోన్ చేసి లక్షన్నర రూపాయలను ముఠా డిమాండ్ చేసింది. ఈ కిడ్నాప్‌కు సంబంధించి త్రినాధ్ బాబు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎంతో చాకచక్యంగా ముఠాను అరెస్టు చేసి,  త్రినాధ్ బాబును విడిపించారు. కిడ్నాప్ ముఠాకు గుడిపూడి జగదీష్ అనే రౌడీ షీటర్ నేతృత్వం వహించినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-12-09T16:54:04+05:30 IST