Eluru: మెడలో ఉరితాళ్లతో టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2021-12-20T17:32:27+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ, సీపీఎంల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ, సీపీఎంల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మెడలో ఉరి తాళ్లు వేసుకుని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వన్ టైం సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం తహశీల్దార్ చంద్రశేఖర్కు నేతలు వినతిపత్రం అందజేశారు.