ఉత్సాహంగా ఉద్యోగినుల క్రీడా పోటీలు

ABN , First Publish Date - 2021-03-01T05:07:57+05:30 IST

ఇండోర్‌ స్టేడియ ంలో మహిళా అధికారులు, ఉద్యోగులకు క్రీడా, సాంస్కృ తిక పోటీలు నిర్వహించా రు.

ఉత్సాహంగా ఉద్యోగినుల క్రీడా పోటీలు
విజేతను ఎత్తుకున్న మహిళా ఉద్యోగినులు

ఏలూరుఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 28 :  ఇండోర్‌ స్టేడియ ంలో మహిళా అధికారులు, ఉద్యోగులకు క్రీడా, సాంస్కృ తిక పోటీలు నిర్వహించా రు. మార్చి 8వ తేదీన ఏలూ రులో ఏపీ జేఏసీ –అమరా వతి ఆధ్వర్యంలో నిర్వహించ నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలను పురస్క రించుకుని ఆదివారం పోటీలు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగినులు హాజర య్యారు. షటిల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ,షాట్‌పుట్‌, త్రోబాల్‌, పరుగు పోటీలు, వ్యాస రచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. క్రీడా పోటీలను జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్‌ సుశీల, జిల్లా శాఖ చైర్మన్‌ కె.రమేష్‌కుమార్‌ ప్రారంభించారు. ప్రతీ విభాగంలోనూ ముగ్గురు విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామ న్నారు. మార్చి 8వ తేదీన ఏలూరు రెవెన్యూ భవన్‌లో మహిళా దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సల్మా, జీతారత్నం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:07:57+05:30 IST