ఈపీఎల్‌ విజేత ఆది లెజెండ్స్‌

ABN , First Publish Date - 2021-03-01T05:06:47+05:30 IST

గెలుపు ఓటములను క్రీడాకారులు సమంగా స్వీక రించాలని ఆంధ్రా ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఎల్‌వి ప్రసాద్‌ అన్నారు

ఈపీఎల్‌ విజేత ఆది లెజెండ్స్‌
ఈపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన ఆది లెజెండ్స్‌ జట్టు

ఏలూరు స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 28 : గెలుపు ఓటములను  క్రీడాకారులు సమంగా స్వీక  రించాలని ఆంధ్రా ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఎల్‌వి ప్రసాద్‌ అన్నారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో  హీరోహూండా షోరూమ్‌ ఆధ్వర్య ంలో ఐపీఎల్‌ తరహాలో ఏలూరు ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. క్రికెట్‌ టోర్నమెంటులో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 16 టీమ్‌లు పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఆది లెజెండ్స్‌, బీఎస్‌కె వారియర్స్‌ జట్లు తలపడ్డాయి. ఆది లెజెండ్స్‌ ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది.ఈ కార్యక్రమంలో  హీరోహూండా షోరూమ్‌ మేనేజర్‌ ఎవీ సోమేశ్వరరావు, టౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, గుప్తా ఫౌండేషన్‌ అధినేత కెకె గుప్తా, నిర్వాహకులు బి.కిషోర్‌, అబ్బూరి అనిల్‌, ఉల్లింగల చందు తదితరులు పర్యవేక్షించారు. 

Updated Date - 2021-03-01T05:06:47+05:30 IST