డాక్టర్‌ కర్రా రాజారావు ఇక లేరు

ABN , First Publish Date - 2021-03-07T05:16:19+05:30 IST

చింతలపూడి నియో జకవర్గ టీడీపీ కన్వీనర్‌ డాక్టర్‌ కర్రా రాజారావు (68) శనివారం ఉద యం 10 గంటలకు హైదరాబాద్‌ ఆసుప త్రిలో మృతి చెందారు.

డాక్టర్‌ కర్రా రాజారావు ఇక లేరు
కర్రా రాజారావు

హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి

చింతలపూడి నియోజకవర్గంలో విషాదఛాయలు

చింతలపూడి, మార్చి 6 : చింతలపూడి నియో జకవర్గ టీడీపీ కన్వీనర్‌ డాక్టర్‌ కర్రా రాజారావు (68) శనివారం ఉద యం 10 గంటలకు హైదరాబాద్‌ ఆసుప త్రిలో మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధప డుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం జి.కొత్తపల్లి ఆయన స్వగ్రామం. 1952 జూలై 15న జన్మించారు. గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆయన 1988 నుంచి 94 వరకూ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో, 95 నుంచి 2009 వరకూ చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్‌గా పనిచే శారు. 2009లో ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ తర పున నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. అయి తే ఆ ఎన్నికల్లో 1300 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తిరిగి 2019లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేసినా గెలుపు అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన నియో జకవర్గ టీడీపీ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పార్ధివ దేహాన్ని చింతలపూడి ఆంతోని నగర్‌లోని ఆయన ఇంటి వద్ద  ఆదివారం ఉదయం 10 గంటల వరకూ సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఆయన స్వగ్రామం జి.కొ త్తపల్లి తీసుకువెళ్తారు. రాజారావు మృతికి టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు సంతాపం ప్రకటించారు.


Updated Date - 2021-03-07T05:16:19+05:30 IST