జిల్లా స్థాయి క్విజ్, పోస్టర్ మేకింగ్ పోటీల విజేతలు
ABN , First Publish Date - 2021-03-07T04:31:24+05:30 IST
చిన్నారులు బహుముఖ ప్రజ్ఞ సాధిం చేలా తల్లిదండ్రులు తర్పీదు ఇవ్వాలని నిట్ ప్రొఫెసర్ కార్తికేయశర్మ సూచిం చారు.
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 6 : చిన్నారులు బహుముఖ ప్రజ్ఞ సాధిం చేలా తల్లిదండ్రులు తర్పీదు ఇవ్వాలని నిట్ ప్రొఫెసర్ కార్తికేయశర్మ సూచిం చారు.డీఆర్ గోయెంకా మహిళా కళాశాల ప్రాంగణంలో శనివారం కౌషల్ జిల్లా స్థాయి క్విజ్, పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. పోటీలకు జిల్లాలోని 21 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. క్విజ్ పోటీల్లో కైకరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ప్రథమ), ఆచంట మండలం మట్టావానిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల (ద్వితీయ),ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు జడ్పీ ఉన్నత పాఠశాల (తృతీయ) స్థానం సాధించారు. పోస్టర్ మేకింగ్లో యలమంచిలి మండలం మట్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల (ప్రథమ),భీమవరం మునిసిపల్ హైస్కూల్(ద్వితీయ),పెదపాడు మండలం వీరమ్మకుంట జడ్పీ ఉన్నత పాఠ శాల (తృతీయ) స్థానం సాధించాయి.ఈ మేరకు విద్యార్థులను అభినందించారు.