బిడ్డకు జన్మనిచ్చింది.. మోసపోయానని తెలుసుకుంది..

ABN , First Publish Date - 2021-03-07T04:33:42+05:30 IST

బాలికను నమ్మించి ఒక యువకుడు మోసగించాడు.

బిడ్డకు జన్మనిచ్చింది.. మోసపోయానని తెలుసుకుంది..

బాలికను మోసగించిన యువకుడిపై కేసు

తాడేపల్లిగూడెం క్రైం, మార్చి 6 : బాలికను నమ్మించి ఒక యువకుడు మోసగించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం కడకట్లకు చెందిన ఉండ్రాజరవపు బాలసంజీవ్‌ ఇంటర్‌ చదివి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఇంటర్‌ చదువుతున్న బాలికను ప్రేమించానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసగించాడు. పెళ్లి చేసుకోమంటే వాయిదా వేస్తూ వస్తున్నాడు.బాలికకు శుక్రవారం రాత్రి  కడుపునొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ప్రాణం లేని ఆడ శిశువు జన్మించింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఆకుల రఘు తెలిపారు. 

Updated Date - 2021-03-07T04:33:42+05:30 IST