AP: జంగారెడ్డిగూడెంలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-09-18T15:18:35+05:30 IST

పశ్చిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మునసబు గారి వీధిలో అర్ధరాత్రి మోడల్ డైరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్‌పై హత్యాయత్నం జరిగింది.

AP: జంగారెడ్డిగూడెంలో వ్యక్తి దారుణ హత్య

ఏలూరు: పశ్చిగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. మునసబు గారి వీధిలో అర్ధరాత్రి మోడల్ డైరీ డిస్ట్రిబ్యూటర్ సురేష్‌పై హత్యాయత్నం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో విచక్షణారహితంగా నరకడంతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని పోలీసులు 108 వాహనంలో  ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో  విజయవాడ తరలించారు. అయితే విజయవాడలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-09-18T15:18:35+05:30 IST