AP: డివైడర్‌ను ఢీకొన్న కారు...పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2021-12-28T13:41:26+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు శివారు గుండుగోలను-కొవ్వూరు జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

AP: డివైడర్‌ను ఢీకొన్న కారు...పలువురికి గాయాలు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు శివారు గుండుగోలను-కొవ్వూరు జాతీయ రహదారిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు విశాఖపట్నం నుండి విజయవాడ వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. బాధితులు మిడ్ డే మీల్స్ కోఆర్డినేటర్స్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-28T13:41:26+05:30 IST