తణుకు, భీమవరం రూట్లలో ఆర్టీసీ గిఫ్ట్ స్కీమ్
ABN , First Publish Date - 2021-03-01T05:14:15+05:30 IST
తణుకు, భీమవరం రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి గిఫ్ట్ స్కీమ్ ప్రారంభిస్తున్నట్టు డీఎం షేక్ షబ్నం చెప్పారు.
తణుకు, ఫిబ్రవరి 28 : తణుకు, భీమవరం రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి గిఫ్ట్ స్కీమ్ ప్రారంభిస్తున్నట్టు డీఎం షేక్ షబ్నం చెప్పారు.ఈ మేరకు ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తణుకు–ఏలూరు, తణుకు–భీమవరం రూట్లలో ప్రయాణించిన వారికి ప్రతీ నెలా ఒకటవ తేదీ, 16వ తేదీ డ్రా తీసి గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందిస్తామన్నారు. ఆయా రూట్లలో ప్రయాణికులు టికెట్ వెనుక భాగంలో పేరు, ఫోన్ నెంబరు రాసి డ్రైవర్ సీటు వెనుకభాగం గిఫ్ట్ బాక్సులో వేయాలన్నారు. వచ్చే నెల 16వ తేదీన మొదటి విడత డ్రా తీస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.