సీతారాముల కల్యాణం కమనీయం
ABN , First Publish Date - 2021-04-22T05:45:27+05:30 IST
జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
ఏలూరు, ఏప్రిల్ 21 : జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొవిడ్ నేపథ్యంలో అతి తక్కువ మందితో సీతారాముల కల్యా ణాన్ని నిర్వహిం చారు. ఏలూరు అమీనాపేట దాసాంజనేయస్వామి ఆలయం కల్యాణోత్సవంలో ఎస్పీ నారాయణ నాయక్, అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు దంపతులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి రామాలయంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దంపతులు స్వామి వారి కల్యాణాన్ని జరిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పానకం, ప్రసాదం పంచిపెట్టారు.