కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2021-03-07T04:37:39+05:30 IST

కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ తణుకు పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ శనివారం చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్‌ డిగ్రీ, పీజీ కళాశాల వద్ద ఆందోళన చేసింది.

కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి
చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్‌ డిగ్రీ, పీజీ కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు

తణుకు, మార్చి 6: కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ తణుకు పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ శనివారం చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్‌ డిగ్రీ, పీజీ కళాశాల వద్ద ఆందోళన చేసింది. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు వినయ్‌, సెక్రటరీ మధు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన కళాశాల మౌలిక సదుపాయాలకు కూడా నోచుకోవడం లేదన్నారు. రెండేళ్లుగా ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా యాజమా న్యం పట్టించుకోవడం లేదన్నారు.ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు టి. అమృత్‌, ఎం.నవీన్‌, దొరబాబు, శివ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-07T04:37:39+05:30 IST