Eluru: ఆటోకి తాళ్లు కట్టి లాగుతూ టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-08-28T17:48:31+05:30 IST

పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ ద్వారకాతిరుమలలో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు.

Eluru: ఆటోకి తాళ్లు కట్టి లాగుతూ టీడీపీ నిరసన

ఏలూరు: పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ ద్వారకా తిరుమలలో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. టీడీపీ శ్రేణులు ఆటోకి తాళ్ళు కట్టి లాగి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని  అన్నారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసే విధంగా చేశారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ పెరిగితే అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయన్నారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం టాక్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. చేతకాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గద్దె దిగాలని టీడీపీతరపున ఆందోళన చేపట్టామన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిలో ఫస్ట్ ఉన్నారని ముప్పిడి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-28T17:48:31+05:30 IST