వీఆర్వోలకు అన్యాయం చేస్తే చూస్తూ ఉరుకోం..
ABN , First Publish Date - 2021-03-01T05:10:16+05:30 IST
వీఆర్వోలకు ఏ విషయంలోనైనా అన్యాయం జరిగితే సహించేదిలేదని అవసరమైతే రెవెన్యూ సంఘాలకు కూడా దూరంగా ఉంటామని జిల్లా వీఆర్వోల సంఘ అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు హెచ్చ రించారు.
తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 28 : వీఆర్వోలకు ఏ విషయంలోనైనా అన్యాయం జరిగితే సహించేదిలేదని అవసరమైతే రెవెన్యూ సంఘాలకు కూడా దూరంగా ఉంటామని జిల్లా వీఆర్వోల సంఘ అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు హెచ్చ రించారు. వీఆర్వోల భవి ష్యత్,పదోన్నతులు, దాడు లు అంశాలపై ఆది వారం తాడేపల్లిగూడెం ఎన్జీవో హోంలో నిర్వహించిన జిల్లా సమావేశంలో మాట్లాడారు. పదోన్న తుల్లో తమకు 75 శాతం వెయిటేజ్ ఇవ్వాలని డిమా ండ్ చేశారు. వీఆర్వోల పదోన్నతులు, దాడులు తదితర అంశాలపై సుదీ ర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి రాంబాబు, ప్రచార కార్యదర్శి లక్ష్మి నారాయణ, జంగారెడ్డిగూడెం, ఏలూ రు,నరసాపురం అధ్యక్షులు అడపా రాంబాబు, వెంక టేశ్వరరావు,వి.ఏసుబాబు, తదితరులు పాల్గొన్నారు.