ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోండి : జేసీ
ABN , First Publish Date - 2021-03-04T05:32:42+05:30 IST
పేదల ఇళ్ల నిర్మా ణంలో భాగంగా సొంతంగా ఇళ్లు నిర్మించుకోవడానికి అంగీకారం తెలిపిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తయ్యేలా సంబంధిత అధికారులు పర్యవేక్షిం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆదేశిం చారు.
ఏలూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : పేదల ఇళ్ల నిర్మా ణంలో భాగంగా సొంతంగా ఇళ్లు నిర్మించుకోవడానికి అంగీకారం తెలిపిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తయ్యేలా సంబంధిత అధికారులు పర్యవేక్షిం చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆదేశిం చారు. ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షుశుక్లా గృహ నిర్మాణాలపై జిల్లాలోని ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ను బుధవారం నిర్వ హించారు. ఇళ్ల నిర్మాణం కోసం ఆప్షన్–2కు అంగీకారం తెలిపిన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలు త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని, ఆప్షన్ –2 ప్రకారం లబ్ధిదారుడే సొంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టుకుంటారని, నిర్మాణ వ్యయాన్ని వారికి ఎనిమిది దశల్లో చెల్లిస్తార న్నారు. లబ్ధిదారుడు కోరితే సిమెంట్ సరఫరా చేయాల న్నారు. జిల్లాలో మొత్తం 1,70,699 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, 56,741 మంది లబ్ధిదారులు ఆప్షన్–2 కు అంగీకారం తెలిపారన్నారు. మనబడి నాడు–నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులలో జిల్లా రాష్ట్రంలోనే ప్రఽథమస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తితో ఇళ్ల నిర్మాణా లపై దృష్టి సారించాలన్నారు.జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ ఎం.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.