13 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-06-22T04:55:33+05:30 IST
కొవిడ్ మహ మ్మారి వేగం తగ్గించింది. ఏలూరు రూరల్ మండలంలో సోమవారం 452కు పైగా టెస్ట్లు నిర్వహించగా ఒక్క కేసు నమోదు కాలేదని మండల వైద్యాధికారి డాక్టర్ దేవ్ మనోహర్ కిరణ్ తెలిపారు.
ఏలూరు రూరల్/పెదపాడు/దెందులూరు/పెదవేగి, జూన్ 21: కొవిడ్ మహ మ్మారి వేగం తగ్గించింది. ఏలూరు రూరల్ మండలంలో సోమవారం 452కు పైగా టెస్ట్లు నిర్వహించగా ఒక్క కేసు నమోదు కాలేదని మండల వైద్యాధికారి డాక్టర్ దేవ్ మనోహర్ కిరణ్ తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నట్టు ఇన్ఛార్జి ఎంపీడీవో సరళకుమారి తెలిపారు. పెదపాడు మండ లంలో పెదపాడు, గుడిపాడు, కొత్తముప్పర్రు, పాతముప్పర్రు గ్రామాల్లో ఒక్కొ క్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కాగా, వట్లూరు పీహెచ్సీ పరిధిలో కేసులు నమోదు కాలేదు. మండలంలో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగ లేదు. దెందులూరు మండలంలో సోమవారం ఎటువంటి కేసులు నమోదు కాలేదని తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మీ తెలిపారు. పెదవేగి మండలంలో సోమవారం తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ టీవీఎల్.ప్రసన్నకుమార్ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1226 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వారిలో హోం ఐసోలేషన్లో 973 మంది ఉండి చికిత్స పూర్తిచేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 149 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని, 84 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.