ఆకలి తీరక.. మూగరోదన

ABN , First Publish Date - 2021-03-01T05:04:13+05:30 IST

మార్చి నెల ప్రారంభంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఎండల తీవ్రతతో పొలం గట్ల వెంబడి, కాల్వలు, బోదెల వెంబడి ఉండే పచ్చగడ్డి సైతం రోజు రోజుకూ కనుమరుగవు తోంది.

ఆకలి తీరక.. మూగరోదన
వీరమ్మకుంట డంపింగ్‌యార్డు సమీపంలో చెత్తలో మేత కోసం వెతుకులాడుతున్న పశువులు

పెదపాడు, ఫిబ్రవరి 28 : మార్చి నెల ప్రారంభంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఎండల తీవ్రతతో పొలం గట్ల వెంబడి, కాల్వలు, బోదెల వెంబడి ఉండే పచ్చగడ్డి సైతం రోజు రోజుకూ కనుమరుగవు తోంది. గుంటలు, పంటబోదెల్లో నీటి నిల్వలు సైతం తగ్గిపోయాయి. దీంతో పశువులు నీరు, మేత కోసం అల్లాడుతున్నాయి. గతంలో గ్రామ శివారుల్లో నీటితొట్టెలు ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపితే, పశు వులు, పక్షులు ఆ నీటిని తాగేవి. ప్రస్తుతం అలాంటి చర్యలేవీ మచ్చు కైనా కానరావడం లేదు. వేసవి తొలినాళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే మున్నుందు వాటి పరిస్థితి ఏంటని పలువురు ఆందోళన చెందుతున్నా రు. వేసవిలో పశుపక్ష్యాదులకు నీరు, పశుగ్రాసం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2021-03-01T05:04:13+05:30 IST